🏠 www.janampowerjournalist.online
Watermark
Newspaper Logo
www.janampowerjournalist.online | Date: 15 Aug, 2026 | Page: 1

మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ

హైదరాబాద్: సామాజిక సంస్కర్తలు, విద్యా ప్రదాతలు స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. నెక్లెస్ రోడ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన విగ్రహాలను సీఎం ఆవిష్కరించి, మహనీయులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో సమానత్వం, విద్యా వ్యాప్తి కోసం పూలే దంపతులు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
🏠 Home