సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్ బానోత్ కావేరి

నార్నూర్ మండల కేంద్రంలోని విజయ్ నగర్ కాలనిలో ఈజీఎస్ ద్వారా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్ బానోత్ కావేరి భూమి పూజ చేసి ప్రారంభించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో PASC చైర్మన్ సురేష్ ఆడే, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చౌహన్ గోవింద్, షేక్ దాదేఅలీ, భిక్కు రాథోడ్, మహేందర్ తదితరులున్నారు.