నేరడిగొండలో డ్రైడే కార్యక్రమం
నేరడిగొండ మండలంలోని వాగ్ధారి, మాదాపూర్ గ్రామాల్లో మంగళవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పవార్ రవీందర్, ఆశా కార్యకర్త వనిత ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఆరోగ్య సూచనలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మాదాపూర్ గ్రామంలో పీఎన్సీ లబ్ధిదారురాలు పెందూర్ విజయశ్రీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టి దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.