కవ్వాల్ టైగర్ జోన్లో ఇసుక మాఫియా పంజా: నిబంధనలను తుంగలో తొక్కుతున్న అక్రమార్కులు! మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు:
పర్యావరణ పరిరక్షణకు, వన్యప్రాణుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతం ఇప్పుడు ఇసుక మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నాలుగు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ సున్నితమైన ప్రాంతాన్ని అక్రమార్కులు తమ వ్యాపార కేంద్రంగా మార్చుకుంటున్నారు. నదీ తీరాల నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను, రహస్యంగా డంపులుగా నిల్వ చేస్తూ రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఆరోపణలు.. అక్రమ రవాణా యవ్వారం స్థానికులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం, ఇసుక దళారులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. నిల్వలు: గ్రామ శివార్లలో, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుకను నిల్వ (డంపులు) చేస్తున్నారు. రవాణా:...